బాలికను లక్కెళ్లి అత్యాచారం

ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన

ఖమ్మం,జూలై28(జ‌నం సాక్షి): ఎన్నిచర్యలు తీసుకున్నా, కఠిన చట్టలు తీసుకుని వచ్చిన అత్యచార ఘటనలు ఆగడం లేదు. మృగాళ్లలో భయం కలగడం లేదు. అనారోగ్యంతో పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ఒక వివాహితుడైన యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. గ్రామంలోని ఓ ఇంటికి సవిూపంలో నిలబడి ఉన్న బాలికను బలవంతంగా లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని ఓ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు ఆ గ్రామానికి చెందిన బాలిక 9వ తరగతి చదువుతోంది. శుక్రవారం తనకు అనారోగ్యంతో ఉండటంతో బడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంది. గ్రామంలోనే ఓ చోట పని చేస్తున్న తన తల్లి వద్దకు వెళ్లొస్తూ రహదారిపై నిలబడింది. దీన్ని గమనించిన మ్లలెబోయిన సురేందర్‌రావు అనే వివాహితుడైన యువకుడు పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక కేకలు పెట్టకుండా నోటిని చేతితో మూసేసి… అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత విద్యార్థిని కేకలు పెట్టడంతో… విని వచ్చిన ఆమె తల్లిని చూసి నిందితుడు పరారయ్యాడు. బాధితురాలి తల్లి కూసుమంచిపోలీసుఠాణాలో ఫిర్యాదు చేశారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.