నాన్నకు ప్రేమతో.. కవిత లేఖాస్త్రాం
` బీఆర్ఎస్ ఫ్యామిలీలో భగ్గుమన్న విభేదాలు
` పార్టీలో పనితీరుపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర అసహనం
` బీజేపీకి చేరువుతున్న తీరును తప్పు పట్టిన కవిత`
` పార్టీలో ఎవరికీ అందనంత దూరంగా కేసీఆర్ తీరు
` పార్టీ రజతోత్సవ సభలో సీనియర్లకు దక్కని ప్రాధాన్యం
` గులాబీ బాస్ను ప్రశ్నిస్తూ లేఖను సంధించిన తనయ
హైదరాబాద్,మే22(జనంసాక్షి):బిఆర్ఎస్ ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు పదపదే చేస్తున్న ఆరోపణలు నిజం చేస్తూ కవిత రాసిన లేఖతో బటటబయలు అయ్యింది. దీంతో ఇప్పుడు బిఆర్ఎస్లో ఏం జరుగుతోందన్న వాదన జరుగుతోంది. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్ తీరుపట్ల ఎమ్మెల్సీ కవిత ధిక్కార స్వరం వినిపించారు. పార్టీ తీరుపై నేరుగా కేసీఆర్కే ప్రశ్నలు సంధించారు. తన సందేహాలను వ్యక్తం చేస్తూ గురువారం నాడు కేసీఆర్కు సంచలన లేఖ రాశారు. ఈ లేఖలో బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ వ్యవహారాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ఇంకా ఈ లేఖలో ఆమె కేసీఆర్కు ఎలాంటి ప్రశ్నలు సంధించారనే వివరాలను చూస్తే, పార్టీ తీరుపట్ల ఆమె అసమనంగా ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపితో అంటకాగేలా వ్యవహారాలు ఉన్నాయని ఆమె భావిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ నిర్ణయాలు, వ్యవహారాల పై సూటిగా ప్రశ్నలు సంధిస్తూ పార్టీ అధినేత కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. పార్టీ లీడర్స్కి యాక్సెస్ ఇవ్వడం లేదంటూ కవిత తన లేఖలో ఆరోపించారు. మై డియర్ డాడీ అంటూ కేసీఆర్కు లేఖ రాసిన కవిత.. బీజేపీతో బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుపై తన సందేహాలను వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తు అంశంపై సిల్విర్ జూబ్లీ సభలో కూడా క్లారిటీ ఇవ్వలేదన్నారు. బీజేపీ విూద రెండు నిమిషాలే మాట్లాడారని.. ఆ పార్టీపై ఇంకా బలంగా మాట్లాడాల్సిందని కవిత అభిప్రాయపడ్డారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటారేమో అనే చర్చ మొదలైందన్నారు. తాను సఫర్ అయ్యాను కదా.. బహుశా అందుకని కావొచ్చు అని కవిత తన లేఖలో పేర్కొన్నారు. బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందని కవిత తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. కాంగ్రెస్పై గ్రాస్రూట్స్లో నమ్మకం పోయిందన్న కవిత.. బీజేపీ ఆల్టర్నేటివ్ అనే ఆలోచనను మన కేడర్ చెబుతోందన్నారు. ’ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా.. బీజేపీకి హెల్ప్ చేశామనే మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లింది. కేసీఆర్ యాక్సెస్ దొరకడం లేదని, సెలెక్టివ్ యాక్సెస్ అని జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యే స్థాయి నేతలు బాధపడుతున్నారు. అందరికి అందుబాటులో ఉండేలా ప్రయత్నించండి అంటూ కూడా సూచనలు చేశారు. వరంగల్ సభలో ఉద్యమ నేతలకు సరైన ప్రాధాన్యం దక్కలేదు. 2001 నుంచి విూతో ఉన్నవారికి మాట్లాడే అవకాశం ఇస్తే బావుండేది. పాత ఇన్చార్జ్లకే బాధ్యతలు ఇవ్వడం కూడా కేడర్కు నచ్చలేదు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నవారికి.. నేరుగా పార్టీ ఆఫీసు నుంచే బీ ఫామ్స్ ఇవ్వాలి. వరంగల్ సభలో ఉర్దూలో మాట్లాడలేదు, వక్ఫ్ బిల్లుపై మాట్లాడలేదు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం అంశాన్ని విస్మరించారు.’ అని కవిత తన లేఖలో సంచలన అంశాలను ప్రస్తావించారు. వాస్తవానికి కవిత అమెరికాకు వెళ్లడానికి ముందే కేసీఆర్కు లేఖ రాసినట్లు కాంగ్రెస్ నేత సామ రామ్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రెస్విూట్ పెట్టి మరీ ఈ అంశాన్ని హైలెట్ చేశారు. ఇప్పుడు ఆ లేఖ వ్యవహారం నిజమని తేలింది. లేఖలో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే సామ చెప్పినట్లుగా కేసీఆర్ ఫ్యామిలీలో ఏదో నడుస్తోందనే అనుమానం మరింత బలపడుతోంది.
అంతా కెటిఆర్ పెత్తనం సాగుతోందని, కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇకపోతే ఫ్యామిలీలో కెసిఆర్ను పక్కన పెట్టారని, కెటిఆర్ అంతా తానై కెసిఆర్ను కూడా పట్టించుకోవడం లేదన్న పిసిసి చీఫ్ మహేశ్ గౌడ్ వాదనలకు కూడా బలం చేకూరింది.