బాలికల పాఠశాలను సందర్శించిన ఆడిషినల్ కలెక్టర్

 

మహబూబాబాద్ బ్యూరో-ఆగష్టు24(జనంసాక్షి)

బుధవారం మహబూబాబాద్ జిల్లాల్లోని గుడూరు ఆశ్రమ బాలికల పాఠశాలను అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ నందు విద్యార్దులు త్రాగునీరు సరిపోవుట లేదని మెనూ ప్రకారం భోజనం పెట్టుట లేదని, బాగుండుట లేదని సమస్యలను అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని విద్యార్దులకు తెలిపి హాస్టల్ లోని సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్శనలో ఏటిడబ్ల్యుఓ భాస్కర్, హాస్టల్ ప్రత్యేక అధికారి, ఎంపిడీఓ విజయలక్ష్మీ, హాస్టల్ వార్డెన్ అనిత తదితరులు పాల్గొన్నారు.