బాసర ట్రిపుల్ ఐటీ కి దౌల్తాబాద్ మోడల్ పాఠశాల విద్యార్థులు ఎంపిక…..

దౌల్తాబాద్, ఆగస్టు 22, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో ఇటీవల పదవ తరగతిలో ఉత్తమ మార్కులతో ఉతీర్ణత పొందిన ఎనిమిది మంది విద్యార్థులు
 బాసర ట్రిపుల్ ఐటీ లో ఉచితంగా సీటు సాధించారని స్కూల్ ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపారు. అనతరం ఆయన మాట్లాడుతూ పాఠశాల నుండి బాసర ట్రిపుల్ ఐటీకీ ఎనిమిది మంది విద్యార్థులు ఎంపిక కావడం పాఠశాలకు ఎంతో గర్వించదగ్గ విషయమని, భవిష్యత్తులో విద్యార్థులు ఎన్నో ఉన్నత శిఖరాలకు అధిరోహించేలా పాఠశాల ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని అన్నారు.