బిచ్కుందలో లక్ష రూపాయల నగదు సీజ్

బిచ్కుందలో లక్ష రూపాయల నగదు సీజ్

బిచ్కుంద అక్టోబర్ 26 (జనంసాక్షి)
తెలంగాణలో ఎన్నికల నగారా మోగడంతో వాహనాల రాకపోకలపై పోలీసులు నిఘా పెంచారు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. జిల్లాలోని బిచ్కుంద మండలకేంద్రంలో గఓపన్పల్లఇ కూడలి వద్ద గురువారం నాడు పోలీసులు తనిఖీలు చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వాహనాల ద్వారా డబ్బు మద్యం తరలించకుండా పోలీసులు అధికారులు ముందు జాగ్రత్తగా ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. తగిన ఆధారాలు ఉన్నాయా లెవా దానిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ వాహనంలో 95 వేల రూపాయలు ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ డబ్బులు ఫ్లైయింగ్ స్క్వాడ్ మహేష్ కు అప్పగించినట్లు వారన్నారు.