బిజెపి జిల్లా అధికార ప్రతినిధిగా సంతోష్ కుమార్

వనపర్తి టౌన్: జూన్ 30( జనం సాక్షి ) భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా వనపర్తి నివాసి జర్నలిస్ట్ సంతోష్ కుమార్ యాదవ్ ఎంపికయ్యారు గురువారం వనపర్తి లక్ష్మి కృష్ణ గార్డెన్స్ లో బిజెపి తెలంగాణ సంపర్క్ అభియాన్ కార్యక్రమం లో బిజెపి జాతీయ కోశాధికారి రాజేష్ అగర్వాల్ సంతోష్ కుమార్ ను అధికార ప్రతినిధిగా ఎంపిక చేశారు ఈ సందర్భంగా సంతోష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ కోసం నిరంతరం శ్రమించి రాష్ట్రంలో కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడానికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు జర్నలిస్టుగా కొనసాగుతూ బిజెపి అధికార ప్రతినిధిగా ఎంపికైన సంతోష్ కుమార్ యాదవ్ను పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి బిజెపి జిల్లా అధ్యక్షులు రాజ వర్ధన్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కృష్ణ సబి రెడ్డి వెంకట్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ మీడియా కన్వీనర్ బచ్చు రాము తదితరులు పాల్గొన్నారు