బిజెపి పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి పడాల శ్రీనివాస్

ఆత్మకూర్(ఎం) డిసెంబర్ 7 (జనంసాక్షి) మండలంలోని పల్లెర్ల కూరెళ్ళ మోదుగు బావి గూడెం గ్రామలలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు తడిసిన మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు ఆలేరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్ పాల్గొని వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరెలా ప్రతి ఒక్క కార్యకర్త కష్ట పడి పని చేయాలని కోరారు అదే విదంగా ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటానని కార్యకర్తలు ఎక్కడ అదైర్య పడొద్దని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చ కార్యవర్గ సభ్యులు బొట్టు అబ్బయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు గజరాజు కాశీనాథు మండల ప్రధాన కార్యదర్శులు కళ్లెం రవీందర్ నాతి బిక్షపతి ఓబీసీ మోర్చ మండల అధ్యక్ష కార్యదర్శులు బండి ఉప్పలయ్య బాషబోయిన లింగ స్వామీ కిసాన్ మోర్చ అధ్యక్షులు సోలిపురం నర్సింహ రెడ్డి మాజీ మండల పార్టీ అధ్యక్షుడు బండారి సత్యనారాయణ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి గుర్రం చైతన్య సూదగాని శ్రీహరి పల్లెర్ల గ్రామ శాఖ బూతు అద్యక్షులు ఎదుళ్ళ మల్లారెడ్డి పొడుగు వెంకటేష్ లోడి బద్రి కురెళ్ల గ్రామ శాఖ బూతు అధ్యక్షులు నిమ్మల నర్సింహ తదితరులు పాల్గొన్నారు