బి ఎన్ ఆర్ ట్రస్టు అద్వర్యంలో పేద విధ్యార్థుల ఉన్నత చదువుల కోసం నిరంతర సహకారం

 బిఎన్ రెడ్డి ట్రస్ట్ మెంబెర్ సర్పంచ్ ల ఫోరమ్ యాచారం మండల అధ్యక్షులు కంబాలపల్లి ఉదయశ్రీ
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- బి ఎన్ ఆర్ ట్రస్టు అద్వర్యంలో పేద విధ్యార్థుల ఉన్నత చదువుల కోసం నిరంతర సహకారం అందుతుందని యాచారం మండల సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు       బి ఎన్ ఆర్ ట్రస్టు మెంబర్ కంబాలపల్లి ఉదయశ్రీ రవిందర్ రెడ్డి అన్నారు  గున్ గల్ మొడల్ స్కూల్, మేడిపల్లి హై స్కూలలో ఉచిత బస్ పాసుల పంపీణి కార్యక్రమము జరిగింది. ఈ సందర్బంగా బి ఎన్ ఆర్ ట్రస్టు మెంబర్ ఉదయశ్రీ రవిందర్ రెడ్డి  మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విధ్యార్థుల కోసం నిరంతర సేవ చేస్తామని తెలిపారు.అసిస్టెంట్ ఆర్టీసి ఇబ్రాహింపట్నం డిపో మేనేజర్  అరునేష్,మాట్లాడుతూ పేద విధ్యార్థుల చేస్తున్న బి ఎన్ ఆర్ ట్రస్టు సేవలు గొప్పవి అని అబినందించారు. అనంతరం గున్ గల్ మొడల్ స్కూలులో 145మందికి,మేడిపల్లి స్కూల్ లో 96 మందికి బస్ పాసులు పంపిణి చేయడం జరింది. ఈ కార్యక్రమములో వి హెచ్ పి ఏస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాళ్ళ జంగయ్య,గున్ గల్ మొడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఎమీమా ,మేడిపల్లి స్కూలు ప్రిన్సిపల్ జ్యోతి , మేడిపల్లి మాజీ సర్పంచ్ బోడ క్రిష్ణ,సామాజిక కార్యకర్త ప్రొద్దుటూరి రవిందర్,ఆర్టిసి సిబ్బంది బాల మల్లేష్,వీరన్న,శ్రీనివాస్,ఉపాధ్యాయులు క్రుష్ణయ్య , తదితరులు పాల్గొన్నారు.