బి.సి ల రాజ్యాధికార చైతన్య సదస్సును విజయవంతం చేయండి*

*బిజ్వార్ గ్రామంలో*
మక్తల్ జూలై 05 (జనంసాక్షి) బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఉదయం:10:00 గంటలకు రాయల్ ఫంక్షన్ హాల్ మక్తల్ లో BC ల రాజకీయ చైతన్య సదస్సు శిక్షణ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని
BSP పార్టీ నారాయణపేట జిల్లా ప్రధానకార్యదర్శి జుట్ల నరేందర్ ఒ ప్రకటనలో తెలిపారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కో ఆర్డినేటర్ పసుపుల బాలస్వామి, బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ విచేయుచున్నారు కావున బిసి,ఎస్సి ఎస్టీ, మైనారిటీలు విద్యార్థి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ అర్జున్ రాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జుట్ల నరేందర్, మక్తల్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కెవి నరసింహ, మక్తక్ అసెంబ్లీ నాయకులు దేవరి కృష్ణయ్య ముదిరాజ్, రాజు, ఊట్కూర్ మండల అధ్యక్షుడు జగదీష్, నాయకులు వెంకటేష్, సీతారామయ్య గౌడ్ ఆంజనేయులు, తదితరులు, పాల్గొన్నారు