బీఆర్ఎస్లో చేరికలు.

బీఆర్ఎస్లో చేరికలు

బెల్లంపల్లి, అక్టోబర్ 27, (జనంసాక్షి )
బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండలం బోయపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన వంద మంది నాయకులు శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండి అందిస్తున్న సేవలకు, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయం అందించడమే లక్ష్యంగా పని చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ ప్రణయ్, జడ్పీటీసీ బానయ్య, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.