బీసీసీఐ అధ్యక్షుడిగా జగ్మోహన్ దాల్మియా ఎన్నిక
ముంబై,మార్చి2(జనంసాక్షి): భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడిగా జగ్మోహన్ దాల్మియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బెంగాల్కు చెందిన ప్రముఖ మాజీ క్రికెటర్ దాల్మియా దశాబ్ద కాలం తర్వాత బీసీసీఐ అధ్యక్ష స్థానాన్ని మరోమారు కైవసం చేసుకున్నారు. కార్యదర్శిగా అనురాగ్ ఠాకూర్, టీసీ మాథల్యి అయిదుగురు ఉపాధ్యక్షులలో ఒకరిగా ఎన్నికయ్యారు. అమితాబ్ చౌదరి సంయుక్త కార్యదర్శిగా, అనిరుధ్ ల్మదరి కోశాధికారిగా ఎన్నికయ్యారు.