బీసీ హాస్టల్ నూతన భవనం నిర్మించాలి

ఆదిలాబాద్ జిల్లా బొథ్ మండల కేంద్రంలోని బిసి హాస్టల్ భవనం  శిథిలావస్థలో ఉందని వెంటనే నూతన భవనం నిర్మించాలని కోరుతూ టీజీవీపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతిపత్రం అందించారు. పురాతన భవనం ఉండడం వలన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బిసి హాస్టల్ నూతన భవనం నిర్మించాలని నూతన భవనం నిర్మాణం ఏర్పాటయితే బీసీ విద్యార్థులకు న్యాయం జరుగుతుందని తెలంగాణ విద్యార్థి పరిషత్ కోరుతా ఉంది.ఈ కార్యక్రమంలో బొథ్  పట్టణ మరియు కళాశాల అధ్యక్షులు మాల్కోటి శివరాజ్, ఉపాధ్యక్షులు, బొగ  సంజన  రుచిత బొంపాల కళ్యాణి కొండ్లెపు రాజు, హాస్టల్ ఇన్చార్జి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.