బెంగళూరులో ఆఫ్రికన్లపై దాడి

4 Africans Allegedly Attacked by Mob in Bengaluru

బెంగళూరు: నలుగురు ఆఫ్రికన్లపై బెంగుళూరులో దాడి జరిగింది. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు చెప్పారు. రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా ఓ మూక తమపై దాడి చేసిందని ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆఫ్రికన్ జాతీయుడు జాన్ చెప్పాడు. తనతో సహా తన ముగ్గురు మిత్రులను బైరాతీ ప్రాంతంలో కొందరు దుండగులు వెంబడించి మూడు గంటల పాటు దారుణంగా చితక బాదారని మీడియాకు తెలిపాడు. తమపై వారు ఎందుకు దాడి చేశారో తెలియదని జాన్ అన్నాడు.

అయితే పోలీసులు ఈ ఘటనపై మొదట్లో పెదవి విప్పలేదు. ఎటువంటి దాడి చోటు చేసుకోలేదనీ, అక్కడ కేవలం వాగ్వాదం, తోపులాట మాత్రమే జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు. కేసు దాఖలు చేయడానికి ఆఫ్రికన్లు నిరాకరించారని, తామే దీన్ని సుమోటాగా స్వీకరిస్తున్నామని పోలీసు అధికారి అలోక్ కుమార్ పేర్కొన్నారు. జాన్‌కు తగిలిన గాయాలు దాడి వల్ల జరిగాయా, లేనిదీ విచారిస్తామన్నారు.