బెంగళూరులో మూడు రోజుల పాటు భాజపా సమావేశాలు

హైదరాబాద్‌: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం వచ్చే ఏప్రిల్‌లో బెంగళూరులో నిర్వహించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏప్రిల్‌ తొలివారంలో మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోదీ హాజరవుతారని, మూడు రోజులూ ఆయన బెంగళూరులోనే ఉంటారని భావిస్తున్నారు. సాధారణంగా భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం మూడు నెలలకోసారి జరుగుతుంది. ఈ సారి మాత్రం ఏడు నెలల తర్వాత జరుగుతోంది. జనవరిలో జరగాల్సిన సమావేశం ఒబామా పర్యటన కారణంగా రద్దయినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బెంగళూరు సమావేశంలో బిహార్‌ ఎన్నికలు ప్రధాన చర్చనీయాంశమయ్యే అవకాశం ఉంది.