బెస్ట్ అవార్డు అందుకున్న ఎంపీడీఓకు సన్మానం.

నెరడిగొండఆగస్టు17(జనంసాక్షి): మండలంలో వివిధ ప్రభుత్వ శాఖలో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న  అధికారులకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ చేతుల మీదుగా బెస్ట్ అవార్డులు ప్రశంస పత్రాలను మండల ఎంపీడీఓ అబ్దుల్ సమద్,ఎస్ఐ మహేందర్,ఎపిఓ వసంత్ రావు,ఎపీఎం సుదర్శన్ ఎఈఓ.జైపాల్ తోపాటు పలు అధికారులు ప్రశంస పత్రాలు అందుకున్నారు.ఇందులో భాగంగా బుధవారం రోజునఎంపీడీఓ అబ్దుల్ సమద్ కు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సంబందిత అధికారులు సిబ్బంది  కలిసి శాలువాతోసత్కరించారు.ఉత్తమ సేవలు అందించి ప్రశంస పత్రాలు పొందిన అధికారి మరింత మండల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందిస్తామని తెలిపారు.ప్రభుత్వం గుర్తించి ప్రశంస పత్రాలు అందించడం పట్ల మండల వాసులు ఉద్యోగ సిబ్బంది ఆనందoతో సంతృప్తి వ్యక్తం చేశారు.