బొమ్మ బాంబు పేలుడు: చిన్నారులు మృతి

బొమ్మ బాంబు పేలుడు: చిన్నారులు మృతి
 ఇస్లామాబాద్: అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులతోపాటు తండ్రి బొమ్మ బాంబు పేలుడులో హతమైయ్యారు. ఈ ఘటన పాకిస్థాన్ ఖైబర్ పక్తువ్వా ప్రావెన్స్ స్వాత్ జిల్లా బాషిగ్రామ్ ప్రాంతంలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వారిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. వీరంత ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.

చిన్నారులు ఇంటి బయట ఆడుకుంటున్నారు. మొక్కల వద్ద ఉన్న బొమ్మను చూసి చిన్నారులు ఇంట్లోకి తీసుకువచ్చి ఆడుకుంటున్నారు. ఆ సమయంలో బొమ్మ పేలిందని తెలిపారు. బొమ్మలో బాంబును అమర్చడం వల్లే ఈ బాంబు పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.