-బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి

-ఈ నెల 22న చలో కలెక్టరేట్ ను జయప్రదం చేయండి.
-జిల్లా అధ్యక్షుడు మండ్ల సత్యనారాయణ.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు20(జనంసాక్షి):
బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని బోయ వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షులు మండ్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు.శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని పోస్టర్లను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.బోయ వాల్మీకులను తక్షణమే ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ నెల 22 సోమవారంనాడు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.ఆరోజు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కార్యాలయం లో అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నా రు.ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని గ్రామాల నుండి వాల్మీకి సంఘం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు వెంకటయ్య చంద్రయ్య చిన్న తదితరులు పాల్గొన్నారు.