భారతీయులకు సులువుగా వీసా
సోమవారం ఉదయం న్యూఢిల్లీలో ప్రారంభమైన భారత్- బ్రిటన్ టెక్నాలజీ సదస్సులో బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో కలసి మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రారంభోపన్యాసం చేసిన మోడీ, ఇండియా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని గుర్తు చేశారు. తమ దేశంలోకి విదేశీ పెట్టుబ డులు వెల్లువలా వస్తున్నాయని, బ్రిటన్ నుంచి కూడా పెద్దమొత్తంలో ఇన్వెస్ట మెంట్స ఇప్పటికే వచ్చాయని గుర్తు చేశారు. ఇటీవల దీపావళి వేడుకలు లండన్లో వైభవంగా జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, బ్రిటన్ ప్రధాని యూరప్ దాటి తొలిసారి బయటకు వచ్చిన వేళ, తన పర్యటనకు ఇండియాను ఎన్నుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందని, అందుకు బ్రిటన్ ప్రధానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. సౌరవిద్యుత్ రంగంలో ఇరుదేశాలూ కలసి సంయుక్తంగా 10 మిలియన్ పౌండ్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మోడీ పేర్కొన్నారు. భారతీయులు మరింత సులువుగా బ్రిటన్ కు ప్రయాణించేలా నిబంధనలను సరళతరం చేస్తానని, వీసాలను సులువుగా ఇప్పించేలా నిర్ణయాలు తీసుకుంటానని బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే హామీ ఇచ్చారు.