భారత్‌పై ఎవరి ప్రభావం లేదు : ఖుర్షీద్‌

న్యూఢిల్లీ : నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ దళాల అతిక్రమణపై భారత్‌ చేసిన ప్రతిస్పందనపై ఎవరి ప్రభావం లేదని భారత విదేశాంగమంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ స్పష్టంచేశారు. ఒక జాతీయ ఆంగ్ల ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ భారత్‌ను ఎవరూ ప్రభావితం చేయలేరన్నారు.