భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలి.

 

 

 

 

 

 

 

యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు
కొడిదెల రాము.
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమీక్ష సమావేశం.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్20(జనంసాక్షి):
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈనెల 23 నుండి తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే భారత్ జూడో పాదయాత్రను విజయవంతం చేయాలని యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొడిదెల రాము కోరారు.గురువారం నాడు కొల్లాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో నియోజకవర్గస్థాయి యువజన కాంగ్రెస్ సమీక్ష సమావేశానికి వహీద్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథి గా హాజరైన కొడిదెల రాము భారత్ జూడో పాదయాత్రకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ పాదయాత్ర విజయవంతం చేసేందుకు యువజన కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా సిద్ధం కావాలని క్షేత్రస్థాయి నుండి భారీగా తరలిరావాలని కోరారు.కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీలు అనుసరిస్తున్న విధానాలను గ్రామస్థాయిలో ప్రచారం చేసి పాదయాత్ర విజయవంతం చేసేందుకు సిద్ధం కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో పిసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి జగదీశ్వర్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షులు రాము యాదవ్ తాలూకా అధ్యక్షులు శివప్రసాద్ వివిధ మండలాల అధ్యక్షులు యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.