భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటాం

‘‘534221-hafiz-saeedఇప్పుడు టైం ముజాహిదీన్లది. మోదీ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. పీవోకేలో ఆయన ఏం చేశారో, ఇప్పుడు ముజాహిదీన్లు కశ్మీర్లో అదే పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు’’.. ఈ మాటలన్నది మరెవరో కాదు జమాత్-ఉద్-దవా చీప్, ముంబై దాడి సూత్రధారి హఫీజ్ సయాద్. భారత్ జరిపిన సర్జికల్ దాడులకు కశ్మీర్లో ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ ప్రజల సమక్షంలోనే తేల్చి చెప్పాడు. ఆదివారం పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిర్వహించిన ర్యాలీలో హఫీజ్ మాట్లాడుతూ భారత్‌పై మరోమారు అక్కసు ప్రదర్శించాడు. ‘‘భారత్‌పై ముజాహిదీన్లు జరిపే సర్జికల్ దాడులు ఎలా ఉంటాయంటే జీవితాంతం గుర్తుండిపోతాయి. భారత్ జరిపినట్టు ఉండవు. ప్రపంచం కూడా ఇటువంటి దాడులను ఊహించలేదు’’ అని సయీద్ హెచ్చరించాడు.