భారత ఐటీ రంగంలో తెలంగాణది కీలకమైన ముందడుగు.. కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌

4

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16 (జనంసాక్షి) :  ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోయేలా చర్యలు చేపడుతున్న మంత్రి కేటీఆర్‌ ను, సీఎం కేసీఆర్‌ ను కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అభినందించారు. హైదరాబాద్‌ లో ఉచిత వైఫై సేవలు ప్రారంభించిన రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ ఆయనతో తొలి వీడియో కాల్‌ లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ లో వైఫై సేవలు ప్రారంభించడం అభినందనీయమని కేంద్ర మంత్రి ప్రశంసించారు. హుస్సేన్‌ సాగర్‌ హైదరాబాద్‌ కు అందమైన మణిహారమని కొనియాడారు. పర్యాటకులకు వైఫై సేవలు సౌకర్యవంతంగా ఉంటాయన్నారు. భారత ఐటీ రంగంలో హైదరాబాద్‌ ప్రధాన భాగస్వామి అని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం భారత ఐటీ రంగంలో కీలకమైన ముందడుగుగా అభివర్ణించారు.