భార్యను చంపి భర్త ఆత్మహత్య

ఢిల్లీ : నిన్న ఢిల్లీ మెట్రో స్టేషన్లో భార్యపై కాల్పులు జరిపి ఆమె మరణానికి కారణమైన పవన్‌కుమార్‌ అనే వ్యక్తి అత్మహత్య చేసుకున్నాట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్‌లోని మురాద్‌నగర్‌లో ఒక రైల్వే స్టేషన్‌ సమీపంలో చెట్లుకు ఉరివేసుకుని అతను అత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. భార్యాభర్తల మధ్య ఆస్తి వివాదమే ఈ హత్య, ఆత్మహత్యలకు కారణమని, కోర్టు నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్తుండగా పవన్‌కుమార్‌ భార్య, మామలపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.