భువనగిరి చేరుకున్న నయీమ్‌ మృతదేహం

భువనగిరి: మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్‌ నయీం మృతదేహం భువనగిరి చేరుకుంది. షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో నయీం మృతదేహానికి పంచనామా నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. అనంతరం అతడి మృతదేహాన్ని బంధువులు భువనగిరి తరలించారు. ఈరోజు సాయంత్రం నయీం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. నయీం మృతదేహాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. నయీం అంత్యక్రియల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.