భూమి కొసం భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం రజాకార్లకు ఎదురు తిరిగి పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ..

బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి
కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్26 (జనంసాక్షి);
భూమి కొసం భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం రజాకార్లకు ఎదురు తిరిగి పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి అన్నారు.
భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆద్వర్యంలో తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా విగ్రహానికి బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ భూమి కొసం భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం రజాకార్లకు ఎదురు తిరిగి పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని, తెలంగాణ తెగువను పోరాట పటిమను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప పోరాట యోధురాలు వీర నారి చాకలి ఐలమ్మ గారు అని ఆమె పోరాట పటిమ నేటి తెలంగాణ సమాజానికి ఎంతో స్ఫూర్తి దాయకం అని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అధికార పార్టీ రజాకార్ల కు వ్యతిరేకంగా పోరాడిన వీర అమరులను స్మరించుకొక పోవడం విచారకరం అని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీకాంత్, కౌన్సిలర్ లు శ్రీనివాస్, మానస, నాయకులు భరత్, సురేష్, నరేష్, వెంకట్, రవి, నవీన్, సంతోష్ రెడ్డి, సాయి, హారిక, బలమని, లింగం, రాజ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.