భూసేకరణ వల్ల ప్రయోజనం లేదు : అసదుద్దీన్ ఒవైసీ
న్యూ ఢిల్లీ, మార్చి 10: భూసేకరణ వల్ల ఎలాంటి ప్రజా ప్రయోజనం కలగడం లేదని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మంగళవారం లోక్సభలో భూసేకరణ చట్టంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సహా ఇతర ప్రభుత్వాల కాలంలో 88వేల ఎకరాల భూమిని ధారాదత్తం చేశారని ఆరోపించారు. ప్రయోజనం లేని పనులకు భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వ భూములను వెయ్యి మందికి ధారాదత్తం చేశారని కాగ్ నివేదిక చెబుతోందని ఒవైసీ వివరించారు.