మండలస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక

జనంసాక్షి -తెల్కపల్లి

స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు  ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని పెద్దూరు గ్రామపంచాయతీ సెక్రటరీ A సందీప్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు .వివరాలోకి వెళితే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్బంగా గ్రామస్థాయిలో వాలీబాల్ , కబడ్డీ , ఖోఖో , లాంగ్ జంప్ , టగ్ ఆఫ్ వార్ , పోటీలునిర్వహించామన్నారు . ఇందులో ప్రతిభ కనబర్చిన  క్రీడాకారులను మండల స్థాయి పోటీలకు ఎంపిక చేశామని ఆయన తెలిపారు. ఆటలు  ఆడటం  వలన ఆరోగ్యంగా ఉండొచ్చని సర్పంచ్ శైలజా రెడ్డి  తెలిపారు .కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శైలజా రెడ్డి , ఎంపీటీసీ లింగమయ్య  , వార్డు సభ్యులు ,పంచాయతీ సెక్రటరీ , క్రీడాకారులు ,గ్రామస్థులు , యువకులు పాల్గొన్నారు