మండల కేంద్రంలో ఎంపీపీ చంద్రమోహన్ జన్మదిన వేడుకలు…

కేసముద్రం సెప్టెంబర్ 23 జనం సాక్షి / మండల కేంద్రంలో శుక్రవారం రోజున స్థానిక ఎంపీపీ ఓలం చంద్రమోహన్ జన్మదిన వేడుకలు మిత్రులు,శ్రేయోభిలాషులు నాయకుల మధ్య ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా మండలంలోని అమీనాపుర గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు (చిన్నపిల్లలకు) పెన్సిల్స్, పెన్నులు,పండ్లను అంద జేశారు.ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పురం  రాజమణి రమేష్ ,ఉప సర్పంచ్ శ్రీనివాస్ , గ్రామ పార్టీ అధ్యక్షులు యాకూబ్ రెడ్డి,  నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.