:మండల కేంద్రంలో సామూహిక జాతీయ గీతాలాపన

ఝరాసంగం, ఆగష్టు 16(జనంసాక్షి) : భారత స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు నిండిన సందర్భంగా దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్న వజ్రోత్సవ వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఒక్క నిమిషం సామూహికంగా జాతీయ గీతాలాపన చేసి దేశ భక్తిని మరింత చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఝరాసంగం మండల యంత్రాంగం సర్వం సన్నద్దమై తగు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సెంటర్లో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు స్వచ్చందంగా తరలి వచ్చి సామూహిక జాతీయ గీతాలాపనతో మువ్వన్నెల జెండాకు వందనం చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు, స్తానిక ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సామూహిక జాతీయ గీతాలాపన చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుజాత ఎస్ ఐ రాజేందర్, తెరాస మండల అద్యక్షుడు, రాచయ్య స్వామి, సర్పంచ్ పోరామ్, అద్యక్షుడు జగదీశ్వర్ ఏపిఎం బల కృష్ణ, ఏపీఓ రాజు కుమార్, పశు వైద్యాధికారి డాక్టర్ సునీల్ దత్, మండల కేంద్రంలోని ఆయా పాఠశాలల ప్రానోపాధ్యాయులు పోచయ్య, రత్నయ్య, మత్మహ జ్యోతి బా పులే పాఠశాల ప్రిన్స్ పాల్ మాధవి, కేజీబివి ప్రత్యేక అధికారి, బిసి హాస్టల్ వార్డెన్ శారద, విద్యార్థులు కళాశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.