మండల స్థాయిలో నిర్వహించిన ఫ్రీడమ్ కప్ క్రీడల్లో పల్లెర్ల జడ్పీహెచ్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 18 (జనంసాక్షి) స్వాతంత్ర్య వజ్రోత్సవ సందర్భంగా ఆత్మకూరు మండల స్థాయిలో నిర్వహించిన ఆటల పోటీలో పల్లెర్ల విద్యార్థులు వాలీబాల్ బాలురు ప్రథమ బహుమతి కబడ్డీ బాలికలు ద్వితీయ బహుమతి బాలురు ద్వితీయ బహుమతి కో కో బాలికలు ద్వితీయ బహుమతి బాలురు ద్వితీయ బహుమతి పొదినరు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి గారు మాట్లాడుతూ మండల స్థాయిలో పిల్లలు మన ఊరికి బహుమతులు తీసుకురావడం అలాగే జిల్లాస్థాయి లో జరిగే పోటీలకు ఎంపిక కావడం చాలా సంతోషకరమని అభినందించారు పల్లెర్ల గ్రామం నుండి శనివారం రోజున జిల్లా స్థాయిలో జరిగే పోటీలలో పాల్గొని గ్రామానికి ఇంకెన్ని బహుమతులు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ స్వామి ప్రధానోపాధ్యాయులు స్వామి ఎంపీటీసీ మల్లారెడ్డి పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు రవీందర్ ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి ఎండీ శమిమ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు