మండల స్థాయి సైన్స్ సెమినార్ పోటీలు

కొత్తగూడ ఆగస్ట్ ౩౦ జనంసాక్షి:కొత్తగూడ,గంగారం మండలాలలో విద్యార్థులకు మంగళవారం రోజున మండల విద్యాధికారి శ్రీదేవి ఆధ్వర్యంలో కొత్తగూడ బాలుర ఆశ్రమ పాఠశాలలో మండల స్థాయి సైన్స్ సెమినార్ పోటీలు నిర్వహించారు.ఈ పోటీలలో కొత్తగూడ మండల స్థాయిలో ప్రథమ బహుమతి టి.టి.డబ్ల్యూ.యు.ఆర్.జె.సి గాంధీనగర్ పాఠశాల కు చెందినా బి రిజ్వల,ద్వితీయ బహుమతి జిల్లా పరిషత్ హైస్కూల్ పోగుల్లపల్లి కి చెందిన ఉషశ్రీ,తృతీయ బహుమతి జిల్లా పరిషత్ హైస్కూల్ ఎదుళ్ళపల్లి కి చెందిన వర్షిత లు గెలుపొందారు.గంగారం మండల స్థాయిలో ప్రథమ బహుమతి కేజిబివి గంగారంకు చెందిన శ్రావ్య,ద్వితీయ బహుమతి ఆశ్రమ బాలికల పాఠశాల గంగారంకు చెందిన దివ్య,తృతీయ బహుమతిని ఆశ్రమ బాలుర పాఠశాల మడగూడెంకు చెందిన వీరవర్ధన్ లు గెలుపొందారు.ఈ పోటీలో గెలుపొందిన విద్యార్ధులకు కొత్తగూడ బాలుర ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈసం సురేందర్ చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేసారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చాపల సంపత్,సుమన్,యం.సూరయ్య,యం.హరి, సుబ్బారావు,రమాదేవి,రమణి,రాంబాబు, భద్రులాల్,యం.రమేష్,సరిత,సి.ఆర్.పిలు ఉపేందర్,రమేష్,గిరిబాబు,రమేష్ తదితరులు పాల్గొన్నారు.