మంత్రిని సన్మానించిన ఆర్యవైశ్య సంఘం

బోథ్ (జనంసాక్షి) నవంబర్ 09 రాష్ట్ర దేవాదాయ శాఖ, న్యాయ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు లను ఆర్యవైశ్య సంఘ సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. బోథ్ లో కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆర్యవైశ్య సంఘ సభ్యులు కలిశారు. ఇటీవల ఆర్యవైశ్య సంఘ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కత్తూరి సంపత్ ఆధ్వర్యంలోని బృందం మంత్రి, ఎమ్మెల్యేను మర్యాదపూర్వం కలిసి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కొత్తగా కార్యవర్గం ఎన్నిక కావడంతో మంత్రిని కలిసామన్నారు ఆర్యవై ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి మంత్రి సహకారం కోరగా, ఎల్లవేళలా తమ సహకారం ఉంటుందని మంత్రి పేర్కొన్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు కత్తూరి విశ్వానంద్, కత్తూరి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.