మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

వరంగల్‌: రాష్ట్ర మంత్రి మహీధర్‌రెడ్డి వరంగల్‌లో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. తాగునీటి రిజర్వాయర్‌, హంటర్‌ రోడ్డులోని ఆర్ట్స్‌ గ్యాలరీ భవనాని ప్రారంభించారు.  హాన్మకొండ బస్టాండ్‌ వద్ద కాంప్లెక్స్‌
నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే కాజీపేట వద్ద  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వినయ్‌బాస్కర్‌ అతడి అనుచరులు మంత్రి వాహనాన్ని అడ్డుకున్నారు. నగరంలోని సమస్యలు ఆయనకు విన్నవించారు. ప్లైఓవర్‌ బ్రిడ్జి శిధిలావస్థకు చేరుకుందని వెంటనే చర్యలు తీసుకోవాలనా కోరారు.