మంత్రి గీతారెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు
సంగారెడ్డి, నవంబర్ 12 : చీకటిని తరమికోడుతూ ప్రజలందరి జీవితాలలో వెలుగులు నింపి దీపావళి పండుగని జరుపుకుంటున్న శుభ సందర్భంగా మెదక్ జిల్లా ప్రజలందరికి గౌరవ రాష్ట్ర భారీ పరిశ్రమలు, చక్కెర శాఖ మంత్రి డాక్టర్.జే.గీతారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. చేడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ నెల 13న జరుపుకుంటున్న దీపావళి పండుగ మెదక్ జిల్లా ప్రజలందరి జీవితాల్లో వెలుగులునింపాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.