మంత్రులకు న్యాయసహాయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో మరో పిటిషన్‌

ఢిల్లీ : మంత్రులకు న్యాయసహాయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలయింది. 26 వివాదాస్పద జీవోల వ్యవహారంలో మంత్రులను బాధ్యులను చేయాలంటూ గతంలో న్యాయవాది సుధాకరరెడ్డి వేసిన పిటిషన్‌కు ఓబీ దేవరా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను జత చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.