మంథని బీజేపీ టికెట్ సునీల్ రెడ్డి కే కేటాయించాలి..! –

మంథని బీజేపీ టికెట్ సునీల్ రెడ్డి కే కేటాయించాలి..! 

జనంసాక్షి, మంథని, అక్టోబర్ 26 : బిజెపి పార్టీ మంథని ఎమ్మెల్యే టికెట్ చంద్రపట్ల సునీల్ రెడ్డి కి కేటాయించాలని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొండపాక సత్య ప్రకాష్ అధిష్టానాన్ని కోరారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బీజేపీ పార్టీ ఆఫీస్ లో ముఖ్య నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. గత మూడు సంవత్సరల క్రితం మన పార్టీ అధ్యక్షులు,నాయకులు, కోరగా దాదాపు 30 వేల మంది తో సునీల్ రెడ్డి బీజేపీ పార్టీ లో చేరడం జరిగింది అని, గ్రామ స్థాయిలో, బూత్ స్థాయి లో వారు పాటు పడుతూ, భూపాలపల్లి జిల్లా లోని 5 మండలలో గ్రామ గ్రామ పాదయాత్ర తో పార్టీ అభివృద్ధి కొరకు సునీల్ రెడ్డి కష్టపడ్డారని తెలిపారు. ఒక బీజేపీ కార్యకర్త 100 మంది కార్యకర్తలతో సమానం, అని కార్యకర్తలు, నాయకులు కుటిల రాజకీయలకు లొంగకుండా బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. మంథని బిజెపి ఎమ్మెల్యే టికెట్ సునీల్ రెడ్డికి దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. కొంతమంది పార్టీ లో చేరకుండానే బీజేపీ పార్టీ టికెట్ వస్తుందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, మంథని ప్రాంతంలో బీజేపీ గెలుస్తుందనే అక్కసు తో కార్యకర్తలను, ప్రజలను అయోమయానికి గురిచేస్తూ, పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి నాయకులు కార్యకర్తలు, మనస్థాపానికి గురి కాకుండా ఉండాలని, రాష్ట్ర నాయకత్వం మంథని టికెట్ సునీల్ రెడ్డి కి ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు. గ్రామ గ్రామాన మన అభ్యర్థి సునీల్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. సునీల్ రెడ్డి కి టికెట్ ఇవ్వని పక్షంలో బీజేపీ సిద్ధాంతాలకు నీళ్లు వదిలినట్టే అని, పార్టీ జెండా మోసి కష్టపడ్డ కార్యకర్తల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుందనే , సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అసెంబ్లీ కన్వీనర్ మల్క మోహన్ రావు, జిల్లా అధికార ప్రతినిధి పోతార వేణి క్రాంతికుమార్, అన్ని మండలాల అధ్యక్షులు, జంగాపల్లి అజయ్, ములుమూరు శ్రీనివాస్, వీరబోయిన రాజేందర్, పెయ్యాల కుమార్, ముడుతనపల్లి ప్రభాకర్, పిలుమర్రి సంపత్, బొమ్మన భాస్కర్ రెడ్డి, కోయల్ కార్ నిరంజన్, సిరిపురం శ్రీమన్నారాయణ, పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి, మహిళ మోర్చా మండల అధ్యక్షురాలు బోసెల్లి మౌనిక, సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, కువ్వు సత్యనారాయణ, మచ్చగిరి రాము, కోరబోయిన మల్లికార్జున్, సోషల్ మీడియా నియోజకవర్గ ఇంచార్జ్ తోట్ల రాజు,యేటా భూమేష్, రేపాక శంకర్, గుంటి గురువేష్, బోసెల్లి శంకర్, పార్వతి విష్ణు,తదితరులు పాల్గొన్నారు.