మందిపల్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా పల్లెగడ్డ శ్రీను ఎన్నిక

చౌడాపూర్, ఆగస్టు 12( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని మందిపల్ గ్రామంలో ముదిరాజుల ఐక్యత కోసం పరిగి ముదిరాజ్ సంఘాలు మరియు చౌడాపూర్ మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కృష్ణ మరియు ప్రధాన కార్యదర్శి సింగరమోని శ్రీను ఆధ్వర్యంలో గ్రామ ముదిరాజ్ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో నూతన కమిటీ అధ్యక్షుడిగా పల్లెగడ్డ శ్రీను, ఉపాధ్యక్షులుగా నవీన్,నర్సింలు, ప్రధాన కార్యదర్శి తిక్క గంగయ్యను ఎన్నుకున్నారు. ఈ కమిటీలు సలహాదారులుగా సంటి అంజయ్య,కుండలి కృష్ణయ్యలను తదితరులను నియమించడం జరిగింది.తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు ముదిరాజ్, సాయికుమార్,కావలి చెన్నయ్య, కుండలి మల్లేష్,శివ మరియు కమిటీలోని సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది.