మనస్థాపంతో యువతి ఆత్మహత్య

ఇటిక్యాల (జనం సాక్షి) అక్టోబర్ 22 మనస్థాపంతో యువతి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని వేముల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. కోదండపురం ఎస్ఐ వెంకటస్వామి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం ప్రకటించిన కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రిలిమనరీ పరీక్ష ఫలితాల్లో అర్హత సాధించకపోవడంతో మనస్థాపానికి గురై యువతి వెంకటేశ్వరమ్మ (25) అనే మహిళ ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం కర్నూలు హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోస్టుమార్టం నిర్వహించి అనంతరం మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.