మనస్థాపం చెందిన భర్త ఆత్మహత్య…

కేసముద్రం ఆగస్టు 15 జనం సాక్షి / భార్య కాపురానికి రాలేదని మనస్థాపం చెందిన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కేసముద్రం స్టేషన్ గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్సై తిరుపతి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పెద్ద కొరుపోలు గ్రామానికి చెందిన గై. రాజు (32) కేసముద్రం స్టేషన్ లోని తన బావ బాలకృష్ణ టైర్ పంచర్ షాపులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రాజు భార్య నిఖిత నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో మనస్థాపానికి గురై,ఇంట్లో ఎవరూ లేనిది చూసి, తన బావ షాపులో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.తన బావ బాలకృష్ణ కుటుంబ సభ్యులు బోనాల పండుగ కోసం ఆదివారం నర్సంపేట మండలం సాంబయ్య పల్లికి వెళ్లారు.మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుని తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.