మన్మోహన్‌ సింగ్‌తో ఎన్‌సీపీ బృందం భేటీ

rc05wrxlన్యూఢిల్లీ, మార్చి 17 : బొగ్గు కుంభకోణంలో నిందితుడుగా ముద్రపడిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌తో నేషనలిస్టు కాంగ్రెస్‌ బృందం ఆయన నివాసంలో భేటీ అయింది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవర్‌ నేతృత్వంలోని బృందం ఆయనకు అండగా నిలబడతామని హామీ ఇచ్చింది. ఆయా వ్యవస్థపై తమకు గౌరవం ఉందని, అయితే మన్మోహన్‌సింగ్‌ నీతి, నిజాయితీలపై తమకు పూర్తి నమ్మకం ఉందని శరత్‌పవర్‌ అన్నారు. ఆ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి తారీక్‌ అన్వర్‌, ఎన్సీపీ సీనియర్‌ నేత మజిద్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించనున్న ర్యాలీ గురించి ఈ సమావేశంలో చర్చింరారు.