మన హక్కులు ఎవరి సొత్తు కాదు… మన హక్కులు మనమే సాధించు కోవాలి…

-జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య…
భక్త కనకదాసు జయంతి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న..
-జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య..
-ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి..
-నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్ గొంగళ రంజిత్ కుమార్..
గద్వాల ప్రతినిధి నవంబర్ 11 (జనంసాక్షి):-    జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలో వైఎస్ఆర్ చౌరస్తా వద్ద కనక దాసు చిత్రపటాన్నికి పూలమాలలు వేసి పుజాలు చేశారు.. మండల పరిధిలోని నెట్టెంపాడు గ్రామంలో శ్రీశ్రీశ్రీ కనకదాసు జయంతి సందర్భంగా కనకదాసు  నూతన విగ్రహాన్ని ముఖ్య అతిధులుగా జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య.. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.. నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్ గొంగళ రంజిత్ కుమార్ హాజరై ఆవిష్కరించారు..అనంతరం పూలమాలలు వేసి పూజలు చేసారు…ఈ సందర్భంగా జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ మాట్లాడుతూ కురువలు ఎప్పుడూ తక్కువ కులం వారు కాదు..మన హక్కులు ఎవరి సొత్తు కాదు… మన హక్కు లను మనమే సాధించుకోవాలని పిలుపునిచ్చారు…ఈ కార్యక్రమంలో కేటిదొడ్డి మండల జెడ్పిటిసి రాజశేఖర్, గట్టు ఎంపిపి విజయ్ కుమార్, పాగుంట వెంకన్న స్వామి ఆలయ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, కురువ కుల సోదరులు తదితరులు పాల్గొన్నారు..