మరోసారి వాయిదా పడ్డ శాసనసభ

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభలో వాయిదాల పర్వం కొనసాగుతుంది. విపక్షాల ఆందోళనల మధ్య సభ మరోసారి అరగంటపాటు వాయిదాపడింది. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే టీఆర్‌ఎస్‌ శాసన సభ్యులు తెలంగాణపై తీర్మాణం చేయాలని స్పీకర్‌ పోడియాన్ని ముట్టడించారు. సభ స.ఆవుగా సాగేందుకు సహకరించాలని మంత్రి అనం విపక్ష సభ్యులకు సూచించారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్‌ సభను అరగంట వాయిదా వేశారు.