మర్రిపల్లి యుపిఎస్ పాఠశాల విద్యార్థులకు, సింగిల్ విండో చైర్మన్ సత్తు భూపాల్ రావు, అభినందన.

నాగర్ కర్నూలు జిల్లా, ఉప్పునుంతల,మండలంలోని మర్రిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని యుపిఎస్ పాఠశాల విద్యార్థులు గురుకుల పాఠశాలలో సీట్లు సాధించిన సందర్భంగా ఉప్పునుంతల, సింగిల్ విండో చైర్మన్,సత్తు భూపాల్ రావు వారిని సన్మానించి, ఒక్కో విద్యార్థికి 5000/- రూపాయలు బహుమతి అందించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, రామారావు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మణరావు, గ్రామ సర్పంచ్ పద్మ, ఎస్ఎంసి చైర్మన్ మాసయ్య, ఉప సర్పంచ్ మురళి, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడి ఉపాధ్యాయులు,              విద్యా భిమానులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.