మలేషియా – విశాఖ: డైరెక్ట్ విమానం!

కౌలాలంపూర్ : చవక విమానయానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఎయిర్ ఏషియా సంస్థ ఇప్పుడు నేరుగా విశాఖపట్నం నుంచి మలేషియాకు, అటు నుంచి ఇటు విమానాలు నడపడం ప్రారంభించనుంది. వారానికి మూడుసార్లు ఈ విమానాలు నడుస్తాయి.

మే 7వ తేదీన  ఈ విమానాల రాకపోకలు మొదలవుతాయి. దీంతోపాటు మరో రెండు మార్గాల్లో కూడా విమానాలు నడుస్తాయి. కౌలాలంపూర్ నుంచి విశాఖపట్నానికి రూ. 4వేలకే టికెట్ అంటూ ప్రమోషనల్ ఆఫర్ను ఎయిరేషియా ప్రకటించింది. మే 7 నుంచి 2016 మార్చి 26 వరకు చేసే ప్రయాణాలకు మంగళవారం నుంచి మార్చి 22 వరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.