మహాత్ముడికి ఘన నివాళులు

raj-ghatదిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేద్రమోదీ, ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, మాజీ ప్రధాని ఆన్మోహన్‌సింగ్‌, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, భాజపా అగ్రనేత ఎల్‌.కె.అడ్వాణీ, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తదితరులు మహాత్ముడికి నివాళులర్పించారు. రాజ్‌ఘాట్‌ వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.