మహారాష్ట్రలో ఘోర ప్రమాదం

 

 

ట్రక్కును ఢీకొన్న మినీ బస్సు

పదిమయంది యాత్రికుల మృతి

ముంబయి,జూన్‌7(జ‌నం సాక్షి): మహారాష్ట్రలోని ముంబయి-ఆగ్రా జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది యాత్రికులు చనిపోయారు. మరో 12మంది తీవ్రంగా గాయపడ్డారు. నాసిక్‌ సవిూపంలోని చాంద్వాడ్‌లో సోగ్రన్‌ ఫాటా ప్రాంతంలో ప్రయాణికులతో వెళుతున్న మినీ బస్సు రోడ్డు పక్కన ఆపి ఉన్న ఇసుక ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మినీ బస్సులో ప్రయాణిస్తున్న వారు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని పర్యటనకు వెళ్లి తిరిగి మహారాష్ట్రలోని ఠానేలో కల్యాణ్‌ ప్రాంతానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.