మహారాష్ట్రలో దారుణం

ఒకే కుటుంబానికి చెందిని ఐదుగురి దారుణ హత్య

నాగ్‌పూర్‌,జూన్‌11(జ‌నం సాక్షి): మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని దారుణంగా చంపారు. నాగ్‌పూర్‌ ఆరాధనానగర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు బిజెపికి చెందిన కమలాకర్‌ పవన్‌కర్‌ కుటుంబంగా గుర్తించారు. అయితే హత్యకు ఆస్తి గొడవలే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దొంగల అనుమానంతో దాడి: ఇద్దరు మృతి

ఇకపోతే ఔరంగాబాద్‌ జిల్లా చందగావ్‌ ప్రాంతంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. దొంగలు అనే అనుమానంతో ఎనిమిది మందిని గ్రామస్థులు చితకబాదారు. దాడిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దాడికి పాల్పడిన 300 మంది గ్రామస్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు.