మాజీ ఎంపీ సదాశివరావు మండ్లిక్ మృతి
ముంబై: మాజీ ఎంపీ సదాశివరావు మండ్లిక్ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. దీర్థకాలిక అస్వస్థతతో బాధపడుతున్న 83 ఏళ్ల సదాశివరావు ముంబైలోని ఆస్పత్రిలో కన్నుమూశారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. సదాశివరావు మూడు సార్లు ఎంపీగా,మహారాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. విద్యాశాఖ,నీటిపారుదల శాఖలకు మంత్రిగా పనిచేశారు.