మారేడుగులో కాంగ్రెస్ పార్టీ నుండి బహుజన సమాజ్ పార్టీలో చేరిన యువకులు

అచ్చంపేట ఆర్సి ఆగస్టు 24 జనం సాక్షి న్యూస్ ; నియోజకవర్గ పరిధిలోని పదర మండలం మారడుగు గ్రామంలో 20 మంది యువకులు కాంగ్రెస్ పార్టీ నుండి బహుజన సమాజ్ పార్టీ లోకి చేరారు. ఈ సందర్భంగా మండల బీఎస్పీ నాయకులు యువకులకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో బిఎస్పి సీనియర్ నాయకులు రామన్న ,ఆనంద్, ఆంజనేయులు ,సైదులు, వినోద్, నిఖిల్, శివ ,మల్లేష్ ,ఏకలవ్య, తదితరులు పాల్గొన్నారు.