మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా ఎంపిటిసి కలిమిచర్ల గోపాల్ గుప్తా ..

– వైస్ చైర్మన్ ఎంపిక పట్ల హర్షం.
ఊరుకొండ, సెప్టెంబర్ 15 (జనంసాక్షి):
ఊరుకొండ మండల పరిధిలోని రాంరెడ్డి పల్లి గ్రామ ఎంపీటీసీ సభ్యులు కలిమిచర్ల గోపాల్ గుప్తాను కల్వకుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా ఎంపిక చేయడం పట్ల ఊరుకొండ మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక సర్పంచ్ శివరాణి హరీష్, గ్రామ పెద్దలు సుజీవన్ రెడ్డి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా
ఎంపిటిసి కలిమిచర్ల గోపాల్ గుప్తా మాట్లాడుతూ .. తనపై పూర్తి నమ్మకం ఉంచి కల్వకుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా ఎంపిక చేసిన అందుకు సహకరించిన జడ్చర్ల శాసనసభ్యులు డాక్టర్ చర్లకొల లక్ష్మారెడ్డికి, కల్వకుర్తి శాసనసభ్యులు గుర్క జైపాల్ యాదవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన గ్రామ ఎంపీటీసీని కల్వకుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా ఎంపిక చేయడం పట్ల రామ్ రెడ్డి పల్లి గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎంపికైన సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే గురుక జైపాల్ యాదవ్ సమక్షంలో స్వీట్లు తినిపించుకున్నారు. కార్యక్రమంలో కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ గౌడ్, పలువురు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.